పరిటాల సునీత చేపట్టిన నిరాహార దీక్ష భగ్నం

ఆరోగ్యం క్షీణించడంతో పోలీసులు సునీత దీక్ష భగ్నం చేసి ఆసుపత్రికి తరలింపు

Paritala Sunitha broke her fast

పాపంపేట : టిడిపి అధినేత చంద్రబాబు అరెస్టుకు నిరసనగా మాజీ మంత్రి పరిటాల సునీత చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షను పోలీసులు తాజాగా భగ్నం చేశారు. పరిటాల సునీత గత రెండు రోజులుగా అనంతపురంలోని పాపంపేటలో దీక్ష నిర్వహిస్తున్నారు. సోమవారం అర్ధరాత్రి వైద్యులు సునీతకు పరీక్షలు నిర్వహించారు. ఆమె ఆరోగ్యం క్షీణించడంతో పోలీసులు మంగళవారం ఆమె దీక్షను భగ్నం చేసి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇతర ముఖ్య నేతలను మూడో పట్టణ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.