దేవరకొండలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్

అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ బిఆర్ఎస్ పార్టీ కి వరుస షాకులు తప్పడం లేదు. ఇప్పటికే ఎంతోమంది పార్టీ ని వీడి కాంగ్రెస్ లో చేరగా ..తాజాగా దేవరకొండలో భారీ షాక్ తగిలింది. తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రధాన అనుచరులు దేవరకొండ ప్రాంతానికి చెందిన కొందరు నేతలు కాంగ్రెస్‌లోకి జంప్ అయ్యారు.

దేవరకొండ మున్సిపల్ చైర్మన్ అలంపల్లి నరసింహ, ఎంపీపీ జాన్ యాదవ్, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు సిరందాస్ కృష్ణయ్య, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మమ్మ కృష్ణయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్, దేవరకొండ టికెట్ ఆశించిన వడ్త్యా దేవేందర్ నాయక్‌తో పాటు పలువురు కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచులు సహా పలువురు దేవరకొండలో బాలు నాయక్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కేవలం వీరు మాత్రమే కాదు రీసెంట్ గా నల్లగొండ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్, కౌన్సిలర్లు ఖయ్యుమ్ బేగ్, ప్రదీప్ నాయక్, జెర్రిపోతుల అశ్విని భాస్కర్ గౌడ్, పబ్బు సాయి శ్రీ సందీప్, రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు ఆజిజుద్దీన్ బషీర్ అలాగే ఇంకో ఎంపీటీసీ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇలా నల్లగొండ లో పెద్ద ఎత్తున బిఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ గూటికి చేరారు.