పుష్ప ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్..?
అల్లు అర్జున్ – సుకుమార్ – దేవి శ్రీ కలయిక లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ పుష్ప గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. పాజిటివ్ టాక్ తో గ్రాండ్ గా విడుదలైన ఈ మూవీ కి బ్లాక్ బస్టర్ టాక్ రావడం తో బాక్స్ ఆఫీస్ భారీ వసూళ్లు రాబడుతూ లాభాల బాట పడుతుంది. ఇక థియేటర్స్ లలో ఈ మూవీ హౌస్ ఫుల్ కలెక్షన్లతో రాబడుతున్నప్పటికీ..ఓటిటి రిలీజ్ గురించి అంత ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు.
ఈ చిత్రం డిజిటల్ రైట్స్ ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ ఇప్పటికే కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో ‘పుష్ప-ది రైజ్’ వచ్చే ఏడాది జనవరి మొదటి వారంలో ప్రైమ్లో రిలీజ్ అవుతుందనే ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై స్పందించిన చిత్రబృందం ఆ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని అంటోంది. ప్రస్తుతం ఉన్న ఒప్పందం ప్రకారం సినిమా విడుదలైన నాలుగు నుండి ఆరు వారాల్లో సినిమా ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. దీని ప్రకారం ఈ సినిమా జనవరి చివరి వారంలో ప్రైమ్లో అందుబాటులోకి వస్తుంది.
ఇదిలా ఉంటె ఈ మూవీ సక్సెస్ మీట్ ను తిరుపతి లో అట్టహాసంగా జరిపారు. ఇందులో భాగంగా హీరో అల్లుఅర్జున్, హీరోయిన్ రష్మిక, సునీల్, అనసూయ, దర్శకుడు సుకుమార్ పలు ఆసక్తికరమైన సంగతులను చెప్పారు. నాకు వచ్చిన క్రెడిట్ అంతా సుకుమార్కే దక్కుతుంది. ఆయనతో పాటు నా సహ నటులందరికీ కూడా. రష్మికతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. అదిరిపోయే ఆల్బమ్ను ఇచ్చిన దేవీశ్రీకి స్పెషల్ థ్యాంక్స్. నా ఫ్యాన్స్ అందరినీ గర్వించేస్థాయికి తీసుకెళ్తాను” అని అల్లుఅర్జున్ చెప్పుకొచ్చారు.