పుష్ప ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్..?

అల్లు అర్జున్ – సుకుమార్ – దేవి శ్రీ కలయిక లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ పుష్ప గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. పాజిటివ్ టాక్ తో గ్రాండ్ గా విడుదలైన ఈ మూవీ కి బ్లాక్ బస్టర్ టాక్ రావడం తో బాక్స్ ఆఫీస్ భారీ వసూళ్లు రాబడుతూ లాభాల బాట పడుతుంది. ఇక థియేటర్స్ లలో ఈ మూవీ హౌస్ ఫుల్ కలెక్షన్లతో రాబడుతున్నప్పటికీ..ఓటిటి రిలీజ్ గురించి అంత ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు.

ఈ చిత్రం డిజిటల్​ రైట్స్​ ప్రముఖ ఓటీటీ అమెజాన్​ ప్రైమ్​ ఇప్పటికే కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో ‘పుష్ప-ది రైజ్’​ వచ్చే ఏడాది జనవరి మొదటి వారంలో ప్రైమ్​లో రిలీజ్​ అవుతుందనే ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై స్పందించిన చిత్రబృందం ఆ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని అంటోంది. ప్రస్తుతం ఉన్న ఒప్పందం ప్రకారం సినిమా విడుదలైన నాలుగు నుండి ఆరు వారాల్లో సినిమా ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. దీని ప్రకారం ఈ సినిమా జనవరి చివరి వారంలో ప్రైమ్​లో అందుబాటులోకి వస్తుంది.

ఇదిలా ఉంటె ఈ మూవీ సక్సెస్ మీట్ ను తిరుపతి లో అట్టహాసంగా జరిపారు. ఇందులో భాగంగా హీరో అల్లుఅర్జున్​, హీరోయిన్ రష్మిక, సునీల్​, అనసూయ, దర్శకుడు సుకుమార్​ పలు ఆసక్తికరమైన సంగతులను చెప్పారు. నాకు వచ్చిన క్రెడిట్​ అంతా సుకుమార్​కే దక్కుతుంది. ఆయనతో పాటు నా సహ నటులందరికీ కూడా. రష్మికతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. అదిరిపోయే ఆల్బమ్​ను ఇచ్చిన దేవీశ్రీకి స్పెషల్​ థ్యాంక్స్​. నా ఫ్యాన్స్​ అందరినీ గర్వించేస్థాయికి తీసుకెళ్తాను” అని అల్లుఅర్జున్ చెప్పుకొచ్చారు.