తమిళ్ హీరో తో డైరెక్టర్ పరుశురాం ఫిలిం..?

ఈ మధ్య తెలుగు డైరెక్టర్స్ తమిళ్ హీరోలతో , తమిళ్ డైరెక్టర్స్ తెలుగు హీరోలతో సినిమాలు చేయడం ఎక్కువైంది. రీసెంట్ గా వంశీ పైడిపల్లి ..హీరో విజయ్ తో ఓ సినిమా చేయగా..తాజాగా వెంకీ అట్లూరి ..హీరో ధనుష్ తో సార్ మూవీ చేసారు. రేపు శుక్రవారం ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అలాగే నాగ చైతన్య సైతం తమిళ్ డైరెక్టర్ ప్రభు తో ఓ సినిమా చేస్తున్నాడు. ఇది సెట్స్ ఫై ఉంది. ఇలా చాలామంది తెలుగు, తమిళ్ డైరెక్టర్స్ , హీరోస్ తో సినిమాలు చేస్తూ బిజీ గా ఉన్నారు. ఈ లిస్ట్ లో గీత గోవిందం ఫేమ్ పరుశురాం కూడా చేరబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

గత ఏడాది సర్కారు వారి పాట మూవీ తో హిట్ అందుకున్న పరుశురాం..లేటెస్ట్ గా విజయ్ దేవరకొండ తో దిల్ రాజు నిర్మాణంలో ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలు ప్రచారం అయ్యాయి. కానీ దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇదిలా ఉండగానే తమిళ్ హీరో కార్తీ తో పరుశురాం ఓ సినిమా చేయబోతున్నట్లు తాజాగా ఫిలిం సర్కిల్లో చక్కర్లు కొడుతుంది. హీరో కార్తీని కలిసి ఓ స్టోరీ వినిపించాడని.. దానికి కార్తీ నుండి సానుకూలమైన స్పందన వచ్చిందని అంటున్నారు. కార్తీకి తెలుగులో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. యుగానికి ఒక్కడు, ఆవారా, నా పేరు శివ, ఖైదీ, ఖాకీ, సర్దార్ ఇలా వరుసగా సూపర్ హిట్స్ తో దూసుకుపోతున్నాడు. దీంతో ఇప్పుడు స్ట్రయిట్ తెలుగు మూవీ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజముంది? అనేది తెలియదు. అయితే.. ఈ సినిమాని తెలుగు నిర్మాతే నిర్మించనున్నాడని అంటున్నారు.