పాన్ కార్డుతో ఆధార్ లింక్.. గడువు పొడిగింపుః కేంద్రం

2023 మార్చి 31 వరకు లింక్ పొడిగించిన కేంద్రం

pan-with-aadhaar-link-up-deadline-extended

న్యూఢిల్లీః పాన్ కార్డుతో ఆధార్ అనుసంధానం చేసేందుకు కేంద్రం ఇప్పటికే ఎన్నోమార్లు గడువు పొడిగించింది. ఈసారి 2023 మార్చి 31న తుదిగడువుగా ప్రకటించింది. వచ్చే ఏడాది మార్చి 31 లోగా ఆధార్ లింక్ చేయకపోతే పాన్ కార్డు పనిచేయదని కేంద్రం స్పష్టం చేసింది. దీనిపై కేంద్ర ఆదాయ పన్ను శాఖ వివరణ ఇచ్చింది.

ఐటీ చట్టం-1961 ప్రకారం మినహాయింపు పరిధిలోకి రాని వారు తప్పనిసరిగా పాన్ ను ఆధార్ తో అనుసంధానం చేసుకోవాలని స్పష్టం చేసింది. ఇప్పటికే విధించిన సాధారణ గడువు ముగిసిందని, గడువు పొడిగించిన నేపథ్యంలో ఆలస్య రుసుం కింద రూ.1000 చెల్లించి పాన్ తో ఆధార్ లింక్ చేసుకోవాల్సి ఉంటుందని ఐటీ శాఖ వెల్లడించింది. ఈ మేరకు ట్విట్టర్ లో ప్రకటన చేసింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/