దేశంలో కొత్తగా 8,084 కరోనా కేసులు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా రోజువారీ కేసులు స్వల్పంగా తగ్గాయి. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు 8,084 మంది వైరస్​ బారిన పడ్డారు. మహమ్మారి వల్ల 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం 4,592 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.68 శాతానికి చేరింది. మృతుల సంఖ్య 1.21 శాతంగా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్​ కేసుల సంఖ్య 0.10 శాతం వద్ద ఉంది. డైలీ పాజిటివిటీ రేటు 3.24 శాతంగా ఉంది.

భారత్​లో ఆదివారం 11,77,146 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 1,95,19,81,150కు చేరింది. మరో 2,49,418 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు. ప్రపంచదేశాల్లో కరోనా కేసులు ఒక్కరోజే 323,394కేసులు వెలుగుచూశాయి. మరో 540 మంది వైరస్​తో ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 540,487,950కు చేరింది. మరణాల సంఖ్య 6,331,430కు చేరింది. ఒక్కరోజే 380,775 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 515,672,844గా ఉంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/