ఎనిమిదో రోజు పెరిగిన పెట్రోలు, డీజిల్ ధ‌ర‌లు

హైదరాబాద్‌: దేశంలో ఇందన ధరలు ఎనిమిదో రోజు కూడా పెరిగాయి. ఢిల్లీలో లీటరు పెట్రోలు ధ‌ర‌ 30 పైసలు, డీజిల్ ధ‌ర 35 పైసలు పెరిగాయి. దీంతో అక్క‌డ లీట‌రు పెట్రోలు రూ.89.29, డీజిల్ ధ‌ర రూ.79.70 కి చేరింది. ముంబయిలో పెట్రోల్ ధర లీటరుకి‌ రూ.95.75కి చేరింది. అలాగే, డీజిల్‌ ధర రూ.86.35కు ఎగ‌బాకింది. హైదరాబాద్‌లోనూ పెట్రోల్‌ ధర లీటరు‌ రూ.92.84కి చేర‌గా, డీజిల్‌ ధర రూ.86.93గా ఉంది. బెంగళూరులో లీట‌రు పెట్రోలు ధ‌ర రూ.92.28, డీజిల్ ధ‌ర రూ.84.49గా ఉంది. చెన్నైలో లీట‌రు పెట్రోలు ధ‌ర రూ.91.45, డీజిల్ ధ‌ర రూ.84.77గా ఉంది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/