జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల అరెస్ట్

అత్యుత్సహం జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను జైలుపాలు చేసింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. ఆయన నుండి సినిమా వచ్చిన, ఆయన బర్త్ డే వచ్చిన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. తాజాగా ఎన్టీఆర్ బర్త్ డే సందర్బంగా ఆయన నటించిన సింహాద్రి మూవీ రీ రిలీజ్ అయ్యింది.

ఈ క్రమంలో కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని చెమ్మనగరిపేటలో సిరివెంకట్, సిరికృష్ణ థియేటర్ వద్ద అభిమానులు రెండు మేకలను వధించి వాటి రక్తాన్ని ఎన్టీఆర్ ఫ్లెక్సీపై చిందించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో, పోలీసులు చర్యలకు దిగారు. వీడియోల ఆధారంగా 9 మంది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులపై కేసు నమోదు చేశారు. వీరిని అదుపులోకి తీసుకున్నారు.