టీడీపీ కేంద్ర కార్యాలయానికి ఎన్‌ఎస్‌జీ ఐజీ..

NSG IG inspected TDP head office

టీడీపీ కేంద్ర కార్యాలయానికి ఎన్ఎస్‌జీ డీఐజీ సమర్దీప్ సింగ్ వెళ్లారు. చంద్రబాబు ఛాంబర్‌తో పాటు పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించి.. టీడీపీ నేతల నుంచి అత్యంత కీలకమైన సమాచారాన్ని సేకరించారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, పోలీసుల నిర్లక్ష్యం, చంద్రబాబు భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ టీడీపీ పార్టీ ఇప్పటికే పలుమార్లు కేంద్రానికి ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో ఈరోజు ఢిల్లీ నుండి వచ్చిన ఎన్​ఎస్​జీ ప్రత్యేక బృందం.. పార్టీ కార్యాలయంతో పాటు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసాన్ని భద్రతా కోణాల్లో అన్ని గదులను పరిశీలించారు. ఇటీవల చంద్రబాబు పర్యటనల్లో తరుచూ గొడవలు జరుగుతుండటం, చంద్రబాబు నివాసం, పార్టీ కార్యాలయంపై దాడి వంటివి పరిగణలోకి తీసుకుని.. చంద్రబాబు భద్రతపై ఎన్​ఎస్​జీ ప్రత్యేక దృష్టి సారించింది.

ఇదిలా ఉంటె కాగా ఉత్తరాంధ్ర, కుప్పం చంద్రబాబు పర్యటనల్లో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. వైస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు భారీగా తరలివెళ్లి చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేశ్ పర్యటనను అడ్డుకునేందుకు ప్రయత్నం చేశారు. అయితే ఈ సమయంలో రాష్ట్ర పోలీసులు అడ్డుకోకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయని టీడీపీ నేతలు భావిస్తున్నారు. ఈ మేరకు ఎన్‌ఎన్జీకి ఫిర్యాదు చేశారు.