నేను బతికే ఉన్నా – రెజ్లర్ నిషా దహియా క్లారిటీ

తనను, తన సోదరుడిని దుండగులు కాల్చి చంపినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని క్లారిటీ ఇచ్చింది రెజ్లర్ నిషా దహియా. మధ్యాహ్నం నుండి రెజ్లర్ నిషా దహియా చనిపోయిందనే వార్తలు సోషల్ మీడియా లో వైరల్ కావడం తో అంత ఖంగారు పడుతూ వస్తున్నారు. ఈ వార్తలను చూసి షాక్ కు గురైన నిషా దహియా..గోండాలో జరుగుతున్న జాతీయ సీనియర్ పోటీల్లో పాల్గొనేందుకు తాను వచ్చానని తెలిపింది.

తాను సురక్షితంగా ఉన్నానని చెప్పారు. తనను, తన సోదరుడిని దుండగులు కాల్చి చంపినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని నేహా చెప్పారు. ఆమె మాట్లాడిన వీడియోను భారత రెజ్లింగ్ సమాఖ్య విడుదల చేసింది. సెర్బియాలోని బెల్ గ్రేడ్ లో జరిగిన ప్రపంచ ఛాంపియన్ షిప్ 65 కేజీల విభాగంలో నిషా దహియా కాంస్య పతకాన్ని సాధించారు.

#WATCH | “I am in Gonda to play senior nationals. I am alright. It’s a fake news (reports of her death). I am fine,” says wrestler Nisha Dahiya in a video issued by Wrestling Federation of India.

(Source: Wrestling Federation of India) pic.twitter.com/fF3d9hFqxG— ANI (@ANI) November 10, 2021