రాష్ట్రంలో ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాలు లేవు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణలోని పలు పల్లెలను ఫ్లోరైడ్ పట్టిపీడించింది. రాష్ట్రంలో 967 ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాలు ఉండేవని ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ తెలిపారు. రాష్ట్రంలో మిషన్ భగీరథ పథకం విజయవంతంగా అమలు చేయడంతో రాష్ట్రంలో ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాలు సున్నాకు చేరుకున్నాయన్నారు. ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా పార్లమెంట్ సాక్షిగా దృవీకరించిందని కెటిఆర్ వెల్లడించారు. ఈ పథకం ఫలితాలకు కేంద్రం విడుదల చేసిన నివేదికనే నిలువెత్తు నిదర్శనం. అన్నారు.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/