రష్యా నుంచి చమురు కొనుగోలును ఆపాలని ఏ దేశం భారత్కు చెప్పలేదుః హర్దీప్ సింగ్ పురి
న్యూఢిల్లీః రష్యా నుంచి ఇంధనాన్ని కొనవద్దు అని ఏ దేశం కూడా తమకు చెప్పలేదని కేంద్ర పెట్రోలియం శాఖ హర్దీప్ సింగ్ పురి తెలిపారు. ఏ దేశం నుంచైనా ఇంధనాన్ని కొనుగోలు చేయడానికి భారత్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. భారత్లో ఉన్న జనాభా దృష్ట్యా, ఇక్కడ ఉన్న వినియోగం దృష్ట్యా .. ఈ నేపథ్యంలో ఎవరి నుంచైనా ఇంధనాన్ని కొంటామని ఆయన అన్నారు. మన విధానాల పట్ల స్పష్టమైన అవగాహన ఉండాలని, ఇంధన భద్రత, ఇంధనం ఖరీదు చేసే స్థోమత విషయాలను ఆలోచిస్తే, అప్పుడు ఎక్కడి నుంచైనా ఇందనం కొంటామని మంత్రి పురి తెలిపారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/telangana/