గణేష్ విగ్రహాల తయారీ ఫై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు

వినాయక విగ్రహాల తయారీ దారులకు తెలంగాణ హైకోర్టు శుభవార్త చెప్పింది. అంతేకాకుండా వినాయక నిమజ్జనంపై హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్​తో విగ్రహాల తయారీపై నిషేధం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే పీవోపీ విగ్రహాలను హుస్సేన్​సాగర్​లో మాత్రం నిమజ్జనం చేయరాదని, జీహెచ్​ఎంసీ నీటి గుంటల్లోనే నిమజ్జనం చేయాలని ఆదేశించింది.

పీవోపీ విగ్రహాల నిషేధంపై గతంలో కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి మార్గదర్శకాలు జారీ చేసింది. పీసీబీ మార్గదర్శకాలను సవాల్ చేస్తూ విగ్రహ తయారీదారులు దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపింది. పీవోపీ విగ్రహాలు నిషేధిస్తూ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి జీవో ఇవ్వలేదన్న న్యాయస్థానం పీవోపీ విగ్రహాల నిషేధంపై ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని పేర్కొంది. విగ్రహాల ఎత్తు తగ్గించేలా ఉత్తర్వులు ఇవ్వాలన్న ప్రభుత్వ అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది.