బిడ్డను కాపాడటానికే కెసిఆర్ తాపత్రయం: ధర్మపురి అర్వింద్

రాబోయే ఎన్నికల్లో బిజెపి గెలవడం ఖాయమన్న ధర్మపురి అర్వింద్

dharmapuri arvind
dharmapuri arvind

హైదరాబాద్‌ః నేతలతో చేరికలతో తెలంగాణ కాంగ్రెస్ జోష్ మీద ఉంది. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు చేరిక కోసం ఢిల్లీ స్థాయిలో చర్చోపచర్చలు జరిగాయి. వాళ్లు కాంగ్రెస్‌లో చేరడం కూడా ఖరారైంది. ఈ నేపథ్యంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కీలక వ్యాఖ్యలు చేశారు.

నేతలు తొందరపడి కాంగ్రెస్ లో చేరొద్దని ఆయన సూచించారు. కాంగ్రెస్ లో చేరిన వాళ్లంతా తిరిగి బిజెపిలోకే వస్తారని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో బిజెపి గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఖమ్మంలో బిజెపి ఎట్లా గెలవాలనే విషయంలో తమ స్ట్రాటజీ తమకుందని చెప్పారు.

చట్టానికి ఎవరూ అతీతులు కాదని.. తప్పు చేస్తే ఎవరికైనా శిక్ష పడాల్సిందేనని ఎమ్మెల్సీ కవితను ఉద్దేశించి చెప్పారు. బిడ్డను కాపాడటానికే కేసీఆర్ తాపత్రయమని ఎద్దేవా చేశారు. కుటుంబ పార్టీలకు ఓటేస్తే వాళ్ల ఆస్తులు పెరుగుతాయని అన్నారు. అదే పిల్లలు భవిష్యత్ కావాలంటే బీజేపీకి ఓటయ్యాలని మోడీ పిలుపునిచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.