ఏపీలో నేటి నుండి తక్కువ ధరకే బియ్యం, కందిపప్పు పంపిణి

ఏపీలో రేషన్ దారులకు తీపి కబురు తెలిపింది రాష్ట్ర సర్కార్. ప్రస్తుతం మార్కెట్ లో నిత్యావసర ధరలు ఎలా ఉన్నాయో చెప్పాల్సిన పనిలేదు. ఏది పట్టుకున్న ఆకాశాన్నంటే ధరలు ఉన్నాయి. దీంతో సామాన్య ప్రజలు ఏం తీసుకోవాలన్న ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ సర్కార్ ఈరోజు నుండి తక్కువ ధరకే కందిపప్పు , బియ్యాన్ని రేషన్ దారులకు అందజేయబోతుంది. మార్కెట్లో ఉన్న ధరల కంటే 15 -20 శాతం తక్కువ ధరలకే వీటిని అందించబోతుంది.

రాష్ట్రంలో ప్రత్యేక కౌంటర్ల ద్వారా బియ్యం, కందిపప్పును మార్కెట్ ధరల కంటే తక్కువ రేట్లకు అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు పౌరసరాఫరాల శాఖ కమిషనర్ అరుణ్ కుమార్ తెలిపారు. రెండు నెలలుగా బియ్యం, కందిపప్పు ధరల్లో పెరుగుదల ఉందని… అందుకే పౌరసరాఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆధ్వర్యంలో…ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో టోకు వ్యాపారులు, వాణిజ్య మండలి ప్రతినిధులు, జాయింట్ కలెక్టర్లు, జిల్లా పౌరసరాఫరాల శాఖ అధికారులతో రెండు రోజులుగా సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సామాజిక బాధ్యతలో భాగంగా వ్యాపారులు, మిల్లర్లు కార్పొరేట్ తక్కువ రేట్లకు నిత్యవసరాలు విక్రయించేందుకు ముందుకు రావాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.