సైకిల్ యాత్రలో గాయపడిన నిమ్మల రామానాయుడు

టిడ్కో ఇళ్లు లబ్ధిదారులకు ఉచితంగా ఇవ్వాలంటూ నిమ్మల సైకిల్ యాత్ర

అమరావతి: టీడీపీ హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆ పార్టీ పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు సైకిల్ యాత్రకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. పాలకొల్లు టిడ్కో ఇళ్ల నుంచి అమరావతి అసెంబ్లీ వరకు సైకిల్ యాత్రను ప్రారంభించారు.

అయితే, ఈ సైకిల్ యాత్రలో చిన్న అపశ్రుతి చోటుచేసుకుంది. సైకిల్ పై నుంచి ఆయన కిందపడ్డారు. ఈ ప్రమాదంలో ఆయన ఎడమ కాలికి గాయమయింది. అనంతరం ప్రథమ చికిత్స చేయించుకున్న నిమ్మల తన సైకిల్ యాత్రను మళ్లీ కొనసాగించారు. పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం శింగవరం వద్ద ఈ ఘటన జరిగింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/