నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ముంబయి: అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం స్టాక్ మార్కెట్లపై పడింది. ఫలితంగా ఏసియన్ మార్కెట్లతో పాటు యూరోపియన్ మార్కెట్లు కూడా ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. మన మార్కెట్లు కూడా నష్టాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 162 పాయింట్లు నష్టపోయి 41,464కు పడిపోయింది. నిఫ్టీ 55 పాయింట్లు పతనమై 12,226 వద్ద స్థిరపడింది.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/sports/