నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

sensex
sensex

ముంబయిః దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి చాలా వరకు లాభాల్లోనే కొనసాగిన సూచీలు… చివర్లో అమ్మకాల ఒత్తిడికి గురై నష్టాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 354 పాయింట్లు నష్టపోయి 71,731కి పడిపోయింది. నిఫ్టీ 82 పాయింట్లు కోల్పోయి 21,771కి దిగజారింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.06 వద్ద కొనసాగుతుంది.