17 చోట్ల ఎన్ఐఏ సోదాలు

బెంగళూరు సెంట్రల్ జైలు నుంచి లష్కరే తోయిబా తీవ్రవాదులు పరారీ కేసులో దేశవ్యాప్తంగా సోదాలు చేస్తోంది NIA. 2024, మార్చి 5వ తేదీ మంగళవారం ఉదయం ఏడు రాష్ట్రాలలో 17 చోట్ల నేషనల్ ఇన్విస్టిగేషన్ ఏజెన్సీ బృందాలు తనిఖీలు చేస్తున్నాయి.

2013లో బెంగళూరు జైలు నుంచి ఉగ్రవాదుల పరారీ కేసు, రామేశ్వరం కేఫ్ ఘటన నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ పాటు మరో 17 ప్రాంతాల్లో ఉదయం నుంచి తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పద వ్యక్తుల ఇళ్లల్లో సోదాలు చేస్తున్నారు. పలు కేసుల్లో నిందితులకు నిషేధిత సంస్థలతో ఉన్న లింకులపై ఆరా తీస్తున్నారు.