గడప గడపకు కార్యక్రమంలో ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి కి షాక్ ఇచ్చిన వృద్ధురాలు..చంద్రబాబుకే నా ఓటు

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించాలని , ఆ ఇంటికి ప్రభుత్వ పధకాలు అందుతున్నాయో లేదో తెలుసుకోవాలని నేతలకు ఆదేశించారు. ఎవరు ఈ కార్యక్రమానికి వెళ్లకపోయినా వచ్చే ఎన్నికల్లో టికెట్స్ ఇవ్వనని తేల్చి చెప్పారు. దీంతో ప్రతి ఒక్క నేత ప్రతి గడప తొక్కుతూ ప్రభుత్వ పధకాలను అడిగి తెలుసుకుంటున్నారు. అయితే ఈ కార్యక్రమంలో చాలామందికి ఎదురుదెబ్బలే తగిలాయి. చాలామంది నేతలను ప్రజలు నిలదీయడం జరిగింది.

తాజాగా ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి కి ఓ వృద్ధురాలు పెద్ద షాక్ ఇచ్చింది. అవ్వ నువ్వు ఎవరికీ ఓటు వేస్తావు అంటే ఏమాత్రం ఆలోచించకుండా చంద్రబాబుకే ఓటు వేస్తానని చెప్పి షాక్ ఇచ్చింది. ఈ ఘటన ఆదోని 17వ వార్డులో చోటుచేసుకుంది. కర్నూలు జిల్లా ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి గడప గడపకూ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆదోని 17వ వార్డులో పర్యటించిన ఆయన.. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ఓ వృద్ధురాలికి వివరించారు. ఎమ్మెల్యే చెప్పిందంతా ఆమె శ్రద్ధగా విన్నది. తర్వాత ఓటేవరికి వేస్తావో చెప్పమ్మా అని అడగ్గా.. చంద్రబాబుకు ఓటేస్తానంటూ ఆ వృద్ధురాలు తడుముకోకుండా చెప్పడం తో ఎమ్మెల్యే షాక్ అయ్యారు.