కోడికత్తి కేసులో విచారణ కు సీఎం జగన్ రావాల్సిందే – కోర్ట్ ఆదేశం

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన కోడికత్తి కేసు విచారణ నేడు విజయవాడలోని ఎన్ఐఏ కోర్టులో కొనసాగుతోంది. ఈరోజు విచారణ సందర్భంగా కోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. తదుపరి విచారణకు జగన్ ను కూడా హాజరుపరచాలని ఎన్ఐఏను ఆదేశించింది. ఎన్నికలకు ముందు విశాఖ విమానాశ్రయంలో ప్రస్తుత సీఎం జగన్ పై శ్రీనివాస్ అనే యువకుడు కోడికత్తితో దాడి చేయడం జరిగింది. ఈ దాడి అప్పట్లో పెద్ద వివాదానికి దారితీసింది. అప్పటి నుండి ఈ కేసు ఆలా కొనసాగుతూనే ఉంది. ఈరోజు కూడా విచారణ జరిగింది.

ఈ కేసులో తొలి సాక్షిగా ఉన్న విశాఖ ఎయిర్ పోర్ట్ అసిస్టెంట్ కమాండెంట్ రాఘవ విచారణకు హాజరు కాకపోవడంతో కేసుకు సంబంధించి మొత్తం ట్రయల్ షెడ్యూల్ ను కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. ఇందులో విక్టిమ్ (బాధితుడు ) షెడ్యూల్ కూడా ఉండాలని తెలిపింది. ఈ కేసులో బాధితుడు జగన్ కావడంతో… ఆయన కూడా కోర్టుకు వచ్చేలా షెడ్యూల్ ను రూపొందించాలని ఎన్ఐఏను జడ్జి ఆదేశించారు. తదుపరి విచారణను ఫిబ్రవరి 15కు వాయిదా వేసిన కోర్టు… ఆరోజు విచారణకు జగన్ రావాలని ఆదేశాలు జారీ చేశారు. 3 వ సాక్షిగా జగన్ పీఏ నాగేశ్వర రెడ్డి సైతం హాజరు కావాలన్న ఎన్ఐఏ కోర్టు.. ఫిబ్రవరి 15వ తేదీలోగా వీరి రాకకు సంబందించి మెమో జారీ చేయాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది.