కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం..

కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. డాక్టర్స్ అందుబాటులో లేకపోవడంతో గర్భిణీకి నర్సులు డెలివరీ చేయడం తో శిశువు మృతి చెందింది. దీంతో శిశువు కుటుంబ సభ్యులు ఆందోలనకు దిగారు.

వివరాల్లోకి వెళ్తే..

నడిగూడెం మండలం కరివిరాల గ్రామానికి చెందిన మానస డెలివరీ కోసం కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. మంగళవారం ఉదయం నొప్పులు రావడంతో సిబ్బంది డాక్టర్ కు సమాచారం ఇచ్చారు. డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో నర్సులు డెలివరీ చేశారు. పసికందుకు సీరియస్ గా ఉందని నర్సులు హడావుడి చేశారు. ఆస్పత్రిలో చిన్న పిల్లల వైద్యులు కూడా అందుబాటులో లేకపోవడం, ఆలస్యం కావడంతో శిశువు మృతి చెందింది. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళలనకు దిగారు.