మమల్ని ఎందుకురా ఎర్రిపుష్పాలని చేస్తారు అంటూ షన్ను – సిరిల ఫై నెటిజన్స్ కామెంట్స్

బిగ్ బాస్ సీజన్ సక్సెస్ ఫుల్ గా 10 వారాలు పూర్తి చేసుకొని 11 వ వారంలోకి అడుగుపెట్టింది. సోమవారం ప్రతి వారం లాగానే వాడి వేడిగా నామినేషన్ పక్రియ పూర్తి అయ్యింది. కెప్టెన్ రవి తప్ప మిగిలిన హౌస్ సభ్యులంతా నామినేషన్ లో ఉన్నారు. ఇక మంగళవారం జరిగిన ఎపిసోడ్ ఫై నెటిజన్లు ఓ రేంజ్ లో కామెంట్స్ వేస్తున్నారు.

సన్నీ గురించి షణ్ముఖ్, సిరి మధ్య చర్చ జరిగింది. ఆ సమయంలో ఇద్దరూ హౌస్‌లో ఏం జరుగుతుందన్న దానిపై మాట్లాడుకున్నారు. అప్పుడు షన్నూ ‘ఇక నుంచి సన్నీని నువ్వు అన్నయ్య అని పిలువు. అలా చేస్తే ఇక నుంచి నిన్ను తిడతాడో లేదో.. ఏలా పడితే అలా మాట్లాడతాడో లేదో చూస్తా’ అంటూ సిరికి సలహా ఇచ్చాడు. దీనికి ఆమె కూడా ఓకే అన్నట్లుగా మాట్లాడింది. మొత్తానికి ఎమోషనల్‌గా చేసి స్ట్రాంగ్‌గా ఉన్న సన్నీ గేమ్‌ను చెడగొట్టేందుకు షణ్ముఖ్ జస్వంత్ ఇప్పుడు కొత్త ప్లాన్ వేసినట్లు కనిపించింది.

ఆ తర్వాత ఇద్దరు గొడవ పడ్డారు. ఆ సమయంలో సిరి ఏకంగా బాత్రూంలో దూరిపోయి నానా హడావిడి చేసింది. అంతకు ముందు షణ్ముఖ్‌కు దిష్టి తగులుతుందని బ్యాండ్‌ను ఇచ్చిన ఆమె.. దానికి తన రక్తాన్ని రాసి ఓవర్ యాక్టింగ్ చేసింది. అలాగే, షణ్ముఖ్ కూడా కెమెరాలు ఉన్నాయన్న విషయాన్ని ఇప్పటికి గ్రహించాడు. దీంతో జాగ్రత్తగా ఉండాలని సిరికి సూచనలు చేశాడు. సిరి, జస్వంత్ ఓవరాక్షన్ చూసిన తర్వాత.. అయ్యా బాబోయ్.. మళ్లీ స్టార్ట్ చేశారు. వీళ్ల ఎమోషనల్ స్టంట్లు చూడటం కంటే.. సన్నీ అరుపులే బెటర్. ఎవరైనా ప్రోవోక్ చేయండి సన్నీని. ఈడొక్కడే అరుస్తాడు. మనం ఎంటర్‌టైన్ అవ్వొచ్చు అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

షణ్ముఖ్ జస్వంత్‌పై ట్రోల్స్ చేస్తూ.. అరేయ్ ఈ బాత్రూంలు కడిగే వాళ్లను షోలోకి ఎందుకు తీసుకొచ్చారు. అసలు వాడి ముఖం చూడటానికే కష్టంగా ఉంది. స్నానం చేస్తుండా ఈ గబ్బు నాయాలా? నువ్వు కూడా కొంచెం ఫినైల్ తాగేయ్. ఇది ఈ కర్మ మాకు అంటూ సిరి, హన్మంతు తాజా ఎపిసోడ్‌పై ఘాటుగా స్పందించారు. బిగ్‌బాస్ షోలో స్క్రీన్ స్పేస్ కోసం ప్రతీ వారం రొటీన్ అయిపోయింది. హోస్ట్ నాగార్జునకు ఇవన్నీ కనపడవు అంటూ ఓ నెటిజన్ ఘాటుగా స్పందించాడు. వీకెండ్ లోపు మళ్లీ ముద్దులు, హగ్గులు, ఐ లవ్ యూలు, మధ్యలో మమల్ని ఎందుకురా ఎర్రిపుష్పాలని చేస్తారు అంటూ ట్రోల్ చేశాడు. మొత్తం మీద షన్ను – సిరి ల వ్యవహారం ఫై ప్రేక్షకులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.