ఎంఆర్ శామ్ క్షిపణి ప్రయోగం సక్సెస్
ఉపరితలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే మధ్య శ్రేణి ఎంఆర్ శామ్ క్షిపణిని భారత నేవీ విజయవంతంగా పరీక్షించింది. వైజాగ్లోని ఐఎన్ఎస్ యుద్ధనౌక నుంచి ఇండియన్ నేవీ.. మీడియం రేంజ్ మిస్సైల్ను ఆకాశంలోకి పంపింది. ఎంఆర్ఎస్ఏఎం క్షిపణులకు యాంటీషిప్ మిస్సైళ్లను ఎదుర్కొనే శక్తి సామర్థ్యం ఉందని నేవీ అధికారులు తెలిపారు. డీఆర్డీవో, ఐఏఐ ఉమ్మడిగా ఈ మిస్సైల్ను అభివృద్ధి చేశాయి. దీన్ని బీడీఎల్ ఉత్పత్తి చేస్తోంది. ఆత్మనిర్భర్ భారత్కు ఇదే సాక్ష్యమని ఈరోజు నేవీ ఓ ప్రకటన లో తెలిపింది.
ఎంఆర్ శామ్ క్షిపణి… 70 కిలోమీటర్ల రేంజిలో శత్రుదేశాల యుద్ధ విమానాలను, అటాకింగ్ హెలికాప్టర్లను, క్రూయిజ్ మిస్సైళ్లను, బాంబర్ డ్రోన్లను ఇది తుత్తునియలు చేయగలదు. ఈ అత్యాధునిక క్షిపణిని డీఆర్డీవో, ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ సంయుక్తంగా అభివృద్ధి చేయగా, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ఉత్పత్తి చేస్తోంది.