పంజాబ్ ఎన్నికల ఫలితాలపై స్పందించిన సిద్దూ
ఆప్కు శుభాకాంక్షలు .. ప్రజా తీర్పే శిరోధార్యం : నవజ్యోత్ సింగ్ సిద్దూ
పంజాబ్: కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్దూ పంజాబ్ ఎన్నికల ఫలితాలపై స్పందించారు. ఘన విజయం సాధించిన ఆమ్ఆద్మీని ఈ సందర్భంగా సిద్దూ అభినందించారు. ‘ప్రజల వాక్కే దైవవాక్కు. ప్రజల తీర్పును శిరసావహిస్తున్నాను. ఆప్కు శుభాకాంక్షలు’ అంటూ సిద్దూ ట్వీట్ చేశారు. పంజాబ్లో ఆప్ దూసుకెళ్తోంది. ముఖ్యమంత్రి పీఠంపై ఆప్ అభ్యర్థి భగవంత్ మాన్ కూర్చోబోతున్నారు. మొత్తం 117 స్థానాలుండగా.. 80 కి పైగా స్థానాల్లో ఆప్ దూసుకెళ్తోంది. సీఎం చెన్నీ, పీసీసీ చీఫ్ సిద్దూ వెనకబడే వున్నారు. కాంగ్రెస్ కేవలం 10కి పైగా నియోజకవర్గాల్లో ఆధిక్యంలో కనిపిస్తోంది.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/andhra-pradesh/