ఈ రాత్రి కి నింగిలోకి దూసుకెళ్లనున్న నాసా అత్యంత శక్తివంతమైన ‘ఆర్టెమిస్1’ రాకెట్

భవిష్యత్తులో చంద్రుని ఉపరితలంలోకి మనుషులను పంపడమే లక్ష్యం

Nasa to re-attempt launching world’s most powerful rocket to Moon tonight

న్యూఢిల్లీః నాసా ఈ రోజు రాత్రి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రాకెట్ ను ప్రయోగించనుంది. భవిష్యత్తులో మానవులు చంద్రుని ఉపరితలంపైకి చేరుకోవడానికి వేదికను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ‘ఆర్టెమిస్1’ అనే వ్యోమ నౌకను నాసా చంద్రునిపైకి పంపనుంది. ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్‌లోని లాంచ్‌ప్యాడ్ 39బి నుంచి ఈ వ్యోమనౌక బయలుదేరుతుంది. భారత కాలమానం ప్రకారం ఈ రాత్రి 11:45 గంటలకు షెడ్యూల్ చేశారు. వాస్తవానికి ఈ ప్రయోగం ఆగస్టు 29వ తేదీనే జరగాల్సింది. కానీ, ఇంధన లీకేజీ కారణంగా చివరి నిమిషంలో రద్దు చేశారు. ఈ సమస్యను సరిదిద్దిన శాస్త్రవేత్తలు ప్రయోగానికి అంత సిద్ధం చేశారు. అమెరికన్ స్పేస్ ఏజెన్సీ కూడా ప్రయోగానికి అనుమతి ఇచ్చింది. వాతావరణ పరిస్థితులు కూడా అనుకూలంగా ఉండటంతో ఈ రాత్రికే ప్రయోగం చేపట్టనున్నారు.

322 అడుగుల (98 మీటర్లు) ఎత్తు ఉన్న ఈ రాకెట్ నాసా ఇప్పటివరకు నిర్మించిన అత్యంత శక్తివంతమైనది కావడం విశేషం. అంత‌రిక్ష ప‌రిశోధ‌న‌లో ఎన్నో ఘనతలు సాధించిన నాసా… భారత్ కు చెందిన ఇస్రో మాదిరిగా చంద్రుడిపైకి వెళ్లడంలో అంతగా విజయం సాధించలేకపోతోంది. ఈ నేపథ్యంలోనే త‌మ చ‌రిత్రలోనే అత్యంత శ‌క్తివంత‌మైన రాకెట్‌గా ఆర్టెమిస్‌-1ను తీర్చిదిద్దింది. కానీ, ఇంజన్లో సమస్యల కారణంగా గత సోమవారం కౌంట్ డౌన్ ను నిలిపి వేసింది. సాంకేతిక సమస్యలను సరిదిద్ది రెండో ప్రయోగానికి రెడీ అయింది. 2024లో చంద్రుని చుట్టూ వ్యోమగాములను పంపి, 2025లో వారిని ఉపరితలంపై దింపేందుకు నాసా ఈ ప్రయోగంతో మొదటి అడుగు వేయాలని చూస్తోంది. ఈ మిషన్కోసం నాసా ఏకంగా 4.1 బిలియన్డాలర్లు ఖర్చు చేసింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/