నా తల్లిని కించపరిచిన వారిని మా నాన్న వదిలిపెట్టినా నేను వదలను – నారా లోకేష్
ఏపీ అసెంబ్లీ లో వైసీపీ నేతలు నారా భువనేశ్వరి ని అనరాని మాటలు అన్న సంగతి తెలిసిందే. ఆ మాటలకూ చంద్రబాబు కన్నీరు పెట్టుకోగా..నందమూరి కుటుంబ సభ్యులు సైతం మీడియా ముందుకు వచ్చి వైసీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. ఈ ఎపిసోడ్ ఇంకా రాష్ట్రంలో నడుస్తూనే ఉంది. నిన్నటికి నిన్న తిరుపతి లో పర్యటించిన నారా భువనేశ్వరి సైతం ఈ ఘటన పట్ల ఆవేదన వ్యక్తం చేసారు. తాజాగా నారా లోకేష్ నా తల్లిని కించపరిచిన వారిని మా నాన్న వదిలిపెట్టినా నేను వదలను అంటూ హెచ్చరించారు.
మీ తల్లి గురించి ఇలాగే మాట్లాడతారా… ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని ఓ రేంజ్ లో రెచ్చి పోయారు. మీరు మనుషులా లేక పశువులా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. మా కుటుంబాన్ని బయటకు లాగాలని ఈ ప్రభుత్వం కంకణం కట్టుకుంది, రానున్న కాలంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని నారా లోకేష్ వార్నింగ్ ఇచ్చారు. త్వరలోనే తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తామని.. అప్పుడు వైసీపీ నేతల పని చెబుతామని వార్నింగ్ ఇచ్చారు.