రేపటి నుంచే నారా లోకేష్‌ పాదయాత్ర పునః ప్రారంభం

Lokesh-in-Yuvagalam-padayatra
Lokesh-in-Yuvagalam-padayatra

అమరావతి : రేపటి నుంచే నారా లోకేష్‌ పాదయాత్ర పునః ప్రారంభం కానుంది. రేపటి నుంచి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభం అవుతుంది. ఈ మేరకు నారా లోకేష్ పాదయాత్ర కు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఈ నెల 29వ తేదీ అంటే రేపటి నుంచే రాత్రి 8.15 గంటలకు లోకేష్ యువగళం పాదయాత్ర తిరిగి ప్రారంభం కానుంది . ఎక్కడ ఆగిందో అక్కడి నుంచే పాదయాత్ర ప్రారంభం కానుంది.

నారా లోకేష్‌ పాదయాత్ర ఈ నెల 8న రాజోలు నియోజకవర్గంలో ఆగింది . చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో ఈ నెల 9న పాదయాత్ర సైట్ నుంచి విజయవాడ వెళ్లిన నారా లోకేష్…తన పాదయాత్రను అర్ధాంతరంగా ఆపేశారు. ఆ తర్వాత పరిణామాల నేపథ్యంలో లోకేష్ ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు . ఇక 20 రోజుల తర్వాత తిరిగి ప్రారంభం కానుంది . ఈ మేరకు టిడిపి పార్టీ కార్యకర్తలుఅన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా.. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న లోకేష్‌.. ఈరోజు ఏపీకి రానున్నారని సమాచారం.