బీజేపీ దెబ్బకు కేసీఆర్ క్లౌడ్ బరస్ట్ అంటున్నాడని విమర్శించిన మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి
మోడీ సభతో కేసీఆర్ ఆగమాగమై వారం తర్వాత బయటకు వచ్చారని..క్లౌడ్ బరస్ట్, విదేశీ కుట్ర అంటున్నాడని విమర్శించారు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి. సోమవారం సూర్యాపేటలో బీజేపీ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..12వేల కోట్ల మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పులమయంగా మార్చారని మండిపడ్డారు. తెలంగాణ వస్తే జీవితాలు మారిపోతాయనుకున్న రాష్ట్ర ప్రజలకు నిరాశే మిగిలిందని, నీళ్లు, నిధులు నియామకాలు వస్తాయనుకున్న ప్రజలు కలలు కంటే..అవి కల్లలు అయ్యాయని అన్నారు.
బండి సంజయ్ న్యాయకత్వంలో తెలంగాణలో బీజేపీ పుంజుకుంటుందని చెప్పుకొచ్చారు. మోడీ సభతో కేసీఆర్ ఆగమాగమై వారం తర్వాత బయటకు వచ్చారని జితేందర్ రెడ్డి చెప్పుకొచ్చారు. బీజేపీ దెబ్బకు క్లౌడ్ బరస్ట్, విదేశీ కుట్ర అంటున్నాడని..క్లౌడ్ బరస్ట్ ఎలా వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ మాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. కేసీఆర్ చేసిన క్లౌడ్ బరస్ట్ వ్యాఖ్యల ఫై బిజెపి నేతలు కిషన్ రెడ్డి ,ఈటెల రాజేందర్ , విజయశాంతి తదితరులు స్పందించడం జరిగింది.