వైఎస్‌ఆర్‌సిపి ఎప్పుడో దిగజారిపోయిందిః నారా లోకేశ్

సదరు చానల్ కు లోకేశ్ రూ.5 కోట్లు ఇచ్చాడంటూ ఓ పత్రికలో కథనం

nara-lokesh

అమరావతిః ‘నా అన్వేషణ’ యూట్యూబ్ చానల్లో ఇటీవల రాజకీయపరమైన అంశాలతో కూడిన వీడియో ఒకటి దర్శనమిచ్చింది. అందులో జింబాబ్వే దేశంలోని అధిక ద్రవ్యోల్బణం పరిస్థితులను, ఏపీ పరిస్థితులను పోల్చడం కనిపిస్తుంది. అయితే, ‘నా అన్వేషణ’ చానల్ కు నారా లోకేశ్ రూ.5 కోట్లు ఇచ్చాడంటూ ఓ పత్రికలో వార్త వచ్చింది. నారా లోకేశ్ డబ్బిచ్చి అతడితో ఆ విధంగా చెప్పించాడన్నది ఆ పత్రికా కథనం సారాంశం.

దీనిపై నారా లోకేశ్ స్పందించారు. “వైఎస్‌ఆర్‌సిపి ఎప్పుడో దిగజారిపోయింది. ఇంతకంటే ఇక దిగజారడానికి ఏమీ లేదు. జగన్ విధ్వంసక పాలనను ప్రశ్నించినవారిని అప్రదిష్ఠ పాల్జేసేలా వైఎస్‌ఆర్‌సిపి 5 రూపాయల పేటీఎం బ్యాచ్ చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. మన రాష్ట్ర శ్రేయస్సు, రాష్ట్ర భవిష్యత్తుపై బాధ్యతాయుతంగా స్పందించి, అభిప్రాయాలను వెల్లడించిన ‘నా అన్వేషణ’ను తప్పకుండా ప్రశంసించాలి” అని పేర్కొన్నారు.