నారా లోకేష్ నేటి పాదయాత్ర షెడ్యూల్ వివరాలు

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గత 38 రోజులుగా యువగళం పేరుతొ పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. పాదయాత్రలో ప్రజలు లోకేష్ కు బ్రహ్మ రధం పడుతున్నారు. ప్రజల కష్టాలను అడిగి తెలుసుకుంటూ , అధికారంలోకి వస్తే ఎలాంటి పధకాలు తీసుకొస్తారో ప్రజలకు తెలియజేస్తూ , ప్రభుత్వం ఫై విమర్శలు చేస్తూ లోకేష్ తన పాదయాత్ర ను ముందుకు తీసుకెళ్తున్నారు.

నిన్నటి తో 497 కిలోమీటర్లు నడిచిన లోకేష్…ఈరోజు మదనపల్లి నియోజకవర్గం పూలవాండ్లపల్లి క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర మొదలుపెట్టారు. ఉదయం ఆయన బోయ సామాజికవర్గీయులతో భేటీ అయ్యారు. మధ్యాహ్నం ఎనుములవారిపల్లిలో భోజన విరామం ఉంటుంది.

ఈరోజు లోకేష్ పాదయాత్ర షెడ్యూల్ చూస్తే..

ఉదయం : 8.00 – పూలవాండ్లపల్లి క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.
8.10 – పూలవాండ్లపల్లిలో బోయ సామాజికవర్గీయులతో భేటీ.
8.40 – మదనపల్లి రూరల్ సీటీఎం-1 పంచాయతీలతో స్థానికులతో మాటామంతీ.
8.55 – సీటీఎం-1 క్రాస్ రోడ్డులో స్థానికులతో భేటీ.
9.15 – సీటీఎం-2 పంచాయితీలో పాదయాత్ర 500 కిలోమీటర్లకు చేరిక, శిలాఫలకం ఆవిష్కరణ.
9.40 – యువనేతకు పార్టీ సీనియర్ నేతల ఆశీర్వచనం.
10.20 – సీటీఎం లేక్ వద్ద స్థానికులతో సమావేశం.
11.00 – కొత్తవారిపల్లి వద్ద స్థానికులతో మాటామంతీ.
11.40 – ఎనుమువారిపల్లిలో చేనేతలతో సమావేశం.
12.40 – ఎనుమువారిపల్లిలో భోజన విరామం.
1.40 – ఎనుమువారిపల్లి భోజన విరామ స్థలంలో ముస్లింలతో ముఖాముఖి.

సాయంత్రం : 3.40 – మెడికల్ కళాశాల నిర్మాణ ప్రాంతంలో యువతతో భేటీ.
4.20 – తురకపల్లిలో స్థానికులతో సమావేశం.
4.45 – వెంకటప్పకొండలో టిడ్కో గృహాల బాధిత లబ్ధిదారులతో భేటీ.
5.25 – తట్టివారిపల్లి వెంగమాంబ సర్కిల్ లో స్థానికులతో మాటామంతీ.
6.20 – తట్టివారిపల్లి దేవతానగర్ లో పార్టీలో చేరికలు.
6.30 – తట్టివారిపల్లి దేవతానగర్ విడిది కేంద్రంలో బస.