నాగార్జున సాగర్ నుంచి ఏపీకి నీళ్లు విడుదల

మొత్తానికి నాగార్జున సాగర్ నుంచి ఏపీకి నీళ్లు విడుదల చేసారు. ప్రతి రోజు 5 వేల క్యూసెక్కుల చొప్పున.. మొత్తం 11 రోజుల పాటు 5 టీఎంసీల నీటిని అధికారులు విడుదలకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఈమేరకు ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ మురళీధర్ రెడ్డి ఆదేశాల మేరకు నాగార్జున సాగర్ ప్రాజెక్టు కుడి కాలువకు… రెండు గేట్ల ద్వారా 5 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. కృష్ణానది యాజమాన్య బోర్డు సభ్యులు అజయ్ కుమార్ గుప్తా పర్యవేక్షణలో అధికారులు నీటిని విడుదల చేశారు.