కేజ్రీవాల్ మంత్రివర్గంలో ఇద్దరు కొత్త మంత్రులు!
న్యూఢిల్లీః కేజ్రీవాల్మంత్రివర్గంలో ఇద్దరు కొత్త మంత్రులు చేరబోతున్నారు. ఆప్ఎమ్మెల్యేలు సౌరభ్ భరద్వాజ్, అతిషిలను క్యాబినెట్లోకి తీసుకోవాలని కేజ్రీవాల్నిర్ణయించినట్లుగా తెలుస్తున్నది. ఈ మేరకు వారి ఇద్దరి పేర్లను ఢిల్లీ లెఫ్టినెంట్గవర్నర్కు పంపారని పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా, డిప్యూటీ సీఎం, మరో మంత్రి రాజీనామాలు ఆమోదించి 24 గంటలు కూడా గడవక ముందే కేజ్రీవాల్ఇద్దరు కొత్త ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో చోటు కల్పించారు.
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, మరో మంత్రి సత్యేంద్ర జైన్ తాజాగా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేయగా.. మనీలాండరింగ్ కేసులో సత్యేంద్ర జైన్ గత 9 నెలలుగా జైలులోనే ఉన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు కేజ్రీవాల్ కేబినెట్లో ఎందుకున్నారంటూ బిజెపి విమర్శల నేపథ్యంలో ఇద్దరు మంత్రులు రాజీనామా చేశారు. తాజా పరిణామాల నేపథ్యంలోనే కొత్తగా ఇద్దరు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు వరించనున్నాయి.