Why Not అంటూ హీట్ పెంచిన మెగా బ్రదర్ నాగబాబు

మెగా బ్రదర్ , జనసేన నేత నాగబాబు మరోసారి సోషల్ మీడియా ద్వారా రాజకీయ వేడి పెంచారు. ఏపీ లో తాజాగా జరిగిఆన్ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఎన్నికలు జరిగిన మూడు స్థానాల్లో విజయం సాధించి జోరు పెంచింది. ఈ ఫలితాలతో వైస్సార్సీపీ పతనం మొదలైందని కామెంట్స్ చేస్తూ..రాబోయే ఎన్నికల్లో కూడా ఇదే రిపీట్ అవుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో టీడీపీ నేతలు మొదలు పెట్టిన Why Not నినాదాన్ని నాగబాబు అందుకున్నారు. ఆయన చేసిన ట్వీట్‌పై జనసేన పార్టీ, వైస్సార్సీపీ ల మధ్య వార్ నడుస్తోంది. నాగబాబు సింపుల్‌గా ‘Why Not పులివెందుల..?’ అంటూ ట్వీట్ చేశారు.

వైస్సార్సీపీ అధినేత, సీఎం జగన్, పార్టీ నాయకులు చాన్నాళ్లుగా ‘వై నాట్ 175 సీట్స్’ అంటున్నారు. అలాగే ‘వై నాట్ కుప్పం’ అంటూ టీడీపీని ఎద్దేవా చేస్తున్నారు. కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ ఓటమిపై స్పందిస్తూ వైస్సార్సీపీ నేతలు ఇలా సెటైర్లు పేల్చారు. ఇప్పుడు నాగబాబు కూడా వైస్సార్సీపీ ని లక్ష్యంగా చేసుకున్నారు. ‘వై నాట్ పులివెందుల’ అంటూ సెటైర్లు పేల్చారు. పరోక్షంగా ఎమ్మెల్సీ ఎన్నికల రిజల్ట్స్​ను ప్రస్తావించారు. నాగబాబు ట్వీట్​కు వైస్సార్సీపీ శ్రేణులు కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. ‘కుప్పం గురించి మీరు నోరు ఎత్తడం లేదంటే.. మనం చంద్రబాబుకు అమ్ముడుపోయామని మీ అభిమానులకు పరోక్షంగా చెబుతున్నట్లే కదా?’ అని కొందరు వైస్సార్సీపీ శ్రేణులు కామెంట్స్ చేశారు. మొత్తం మీద మరోసారి నాగబాబు పొలిటికల్ హీట్ పెంచారని చెప్పొచ్చు.