దీన స్థితిలో ఉన్న నటి పాకీజాకు ఆర్ధిక సాయం చేసిన మెగా బ్రదర్

పాకీజా అంటే తెలియని సినీ లవర్స్ లేరు. మోహన్ బాబు నటించిన అసెంబ్లీ రౌడీ చిత్రంలో పాజీజా చేసిన కామెడీ అందరికీ గుర్తుండే ఉంటాయి. బ్రహ్మానందంతో కలిసి పాకీజా చేసిన కామెడీ ఇప్పటికి నవ్వులు పోయిస్తుంది. ఆ సినిమా తో బాగా పాపులార్టీ సాధించి పలు సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఆ తర్వాత ఆమె కనిపించకుండాపోయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో కనిపించి ఆమె ఎంత ఇబ్బందిలో ఉందొ చెప్పి అందరికి షాక్ ఇచ్చింది. ఎవరైనా ఆర్ధిక సాయం చేయాలనీ కోరడం తో చాలామంది తమకు తోచిన సాయాన్ని అందజేస్తూ వస్తున్నారు.

ఈ క్రమంలో ఈమె ఇంటర్వ్యూ చూసిన మెగా బ్రదర్ నాగబాబు..ఆమెకు లక్ష రూపాయిల ఆర్ధిక సాయం అందజేశారు. ఈ సందర్బంగా నాగబాబు మాట్లాడుతూ.. ‘‘సాయం ఎవరికైనా చేస్తాం.. సాయం చేయాలని అనుకునే వాళ్లు వందలమంది ఉంటారు. సీనియర్ నటి పాకీజా (వాసుకి) దీన స్థితి గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చూసినప్పుడు చాలా బాధగా అనిపించింది. అప్పట్లో ఆమెకు మంచి పేరు వచ్చింది. మోహన్ బాబుగారి సినిమా అసెంబ్లీ రౌడీలో పాకీజాగా అందర్నీ అలరించింది. తాజా ఇంటర్వ్యూలో ఆమెను అలా చూసినప్పుడు చాలా బాధగా అనిపించింది.

ఆర్ధికంగా కొంత సాయం అయితే చేయగలం కానీ.. ఆమె కష్టాలను తీర్చాలంటే ఫిల్మ్ ఇండస్ట్రీ ముందుకు రావాలి. తెలుగు ఇండస్ట్రీ కానీ.. తమిళ ఇండస్ట్రీకానీ ముందుకు వస్తే బాగుండేది. నెలలో ఓ పది రోజుల వర్క్ ఇచ్చినా సరిపోతుంది. కనీసం సీరియల్స్‌లో అవకాశం ఇచ్చినా ఆమెకు హెల్ప్ చేసినట్టు ఉంటుంది. నా వైపు నుంచి వాసుకి అనే నటికి అవకాశాలు రావడానికి ప్రయత్నిస్తాను. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఇండస్ట్రీలో ఉన్న వాళ్లు ఆమెకు అండగా నిలవాలి. వాసుకి త్వరలో మంచి రోజులు రావాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు నాగబాబు. అయితే నాగబాబు తనకి ఆర్ధికసాయం అదించడంతో భావోద్వేగానికి గురైంది పాకీజా. తెలుగు, తమిళ్‌లో ఎన్నోసినిమాల్లో నటించానని.. కనీసం తనకి తినడానికి తిండిలేదన్నా.. ఎవరూ రూపాయి సాయం చేయలేదని.. నాగబాబు ముందుకు వచ్చి తనకి లక్షరూపాయిలు సాయం చేశారని.. దగ్గరే ఉంటే ఆయన కాళ్లకి మొక్కేదాన్ని’ అని చెప్పుకొచ్చింది.