గుర్రాలపై గస్తీ కాయనున్నమహారాష్ట్ర ప్రభుత్వం

వెల్లడించిన హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్

patrol on horses
patrol on horses

ముంబయి: ప్రజాభద్రత, శాంతిభద్రతల కాపాడేందుకు రాష్ట్రంలో ప్రత్యేక గుర్రపు దళాన్ని ఏర్పాటు చేయాలని మహారాష్ట్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ వెల్లడించారు. ఈ దళంలో ఒక ఎస్ఏ, ఒక అసిస్టెంట్ పీఎస్ఎ, నలుగురు హవల్దార్లు, 32 మంది కాని స్టేబుళ్లు ఉంటారు. జనసమ్మర్థం, ట్రాఫిక్ అధికంగా ఉన్న ప్రాంతాల్లో వాహనాలతో వెళ్లి గస్తీ కాయడం కంటే గుర్రాలపై వెళ్లడం సులువుగా ఉంటుందన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. ముఖ్యంగా పండుగలు, ప్రత్యేక రోజులు, ర్యాలీల సమయంలో గుర్రాలపై గస్తీ విధానం ఎంతో ఉపయోగంగా ఉంటుందని అనిల్ తెలిపారు. గుర్రంపై విధులు నిర్వహించే ఒక సాయుధ పోలీసు నేలపై ఉన్న 30 మంది పోలీసులతో సమానమని, ఎత్తులో ఉండడం వల్ల నిఘా బాగుంటుందని ఆయన వివరించారు. పుణే, నాగపూర్ వంటి నగరాల్లో దీన్ని అమల్లోకి తెస్తామని, ప్రస్తుతం పోలీసు విభాగంలో 17 గుర్రాలు ఉన్నాయని వీటి సంఖ్య 30కి పెంచుతామని తెలిపారు. కాగా, రాష్ట్రంలో 1932కు ముందు గుర్రపు దళం ఉండేది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో మళ్లీ 88 ఏళ్ల తర్వాత ఈ విధానం అమల్లోకి వస్తున్నట్టయింది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/