కోహ్లీ కెప్టెన్సీపై సెహ్వాగ్‌ పరోక్ష వ్యాఖ్యలు

MS Dhoni and virender sehwag
MS Dhoni and virender sehwag

న్యూఢిల్లీ: జట్టు ఎంపిక విషయంలో కెప్టెన్‌గా మహేంద్రసింగ్ ధోనికి ఉన్న స్పష్టత మరెవరికీ ఉండేది కాదని టీమిండియా మాజీ క్రికెటర్ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తెలిపాడు. ఆటగాళ్లకు మద్దతుగా నిలవడం ఎంత ముఖ్యమో అతనికి బాగా తెలుసన్నాడు. ఓ స్పోర్ట్స్ వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ.. ధోని కెప్టెన్సీకి ప్రస్తుతానికి ఉన్న తేడాను ఈ డాషింగ్ ఓపెనర్ విశ్లేషించాడు. టీ20ల్లో ఐదోస్థానంలో కేఎల్ రాహుల్‌ బరిలోకి దిగి విఫలమైమతే ప్రస్తుత టీమ్‌మేనేజ్‌మెంట్ అండగా నిలవదని, కానీ ధోని హయాంలో అలా ఉండేది కాదని పరోక్షంగా కోహ్లీ కెప్టెన్సీ తప్పిదాలను చెప్పుకొచ్చాడు. ఐదో స్థానంలో కేఎల్ రాహుల్ ఓ నాలుగుసార్లు విఫలమైతే ప్రస్తుత టీమ్‌మేనేజ్‌మెంట్ వెంటనే అతని బ్యాటింగ్ ఆర్డర్ మారుస్తుంది. కానీ ధోని మాత్రం ఇలా చేసేవాడు కాదు. అలాంటి స్థితిలో ఆటగాళ్లకు మద్దతివ్వడం ఎంతో ముఖ్యమో అతనికి బాగాతెలుసు. అందుకే వారికి అండగా నిలుస్తూ ప్రోత్సహించేవాడు’అని ఈ డాషింగ్ ఓపెనర్ తెలిపాడు. ధోని కెప్టెన్‌గా ఉన్నప్పుడు జట్టులోని ప్రతీ బ్యాట్స్‌మన్ ప్లేస్‌పై అతనికి ఓ స్పష్టత ఉండేది. ఇండియన్ క్రికెట్‌ను ముందుకు తీసుకుపోయే టాలెంట్ ఆటగాళ్లపై అతనెప్పుడు ఓ కన్నేసి ఉంచేవాడు అని సెహ్వాగ్ తెలిపాడు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/