వైసీపీ పార్టీకి ఒంగోలు ఎంపీ మాగుంట రాజీనామా

ఏపీలో అధికార పార్టీ కి వరుస షాకులు తగ్గడం లేదు..ప్రతి రోజు ఎవరో ఒకరు పార్టీని వీడుతున్నట్లు ప్రకటిస్తూ షాకుల మీద షాకులు ఇస్తున్నారు. ఇప్పటికే పలువురు ఎంపీలు , ఎమ్మెల్యేలు పార్టీని వీడగా..తాజాగా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి పార్టీ కి రాజీమా చేశారు. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు.

ఈ సందర్బంగా శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ… మాగుంట కుటుంబం 34 ఏళ్లుగా ఒంగోలులో రాజకీయాలు చేస్తోంది..మాగుంట కుటుంబాన్ని ప్రకాశం జిల్లా ప్రజలు అక్కున చేర్చుకున్నారన్నారు. ప్రకాశం జిల్లా వాసులను కుటుంబ సభ్యులుగా భావిస్తూ వస్తున్నామని…మాగుంట కుటుంబానికి, ప్రజలకు అవినాభావ సంబంధాలు ఉన్నాయని వివరించారు.ఈ 33 ఏళ్ళలో 8 సార్లు పార్లమెంట్ కి, ఒకసారి ఎమ్మెల్సీగా పోటీ చేశాం..మా కుటుంబం కోరుకునేది కేవలం గౌరవమన్నారు. మాకు ఇగోలు లేవు..రాబోయే ఎన్నికల్లో మా కుటుంబం ఓ నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. మా కుమారుడు మాగుంట రాఘవరెడ్డిని పోటీలో ఉంచాలని నిర్ణయించాం..ప్రస్తుత పరిణామాలు బాధాకరమని తెలిపారు. ఇప్పటివరకు సహకరించిన పార్టీ నేతలకు ధన్యవాదాలు అన్నారు. ఎంతో బాధతో పార్టీ నుంచి రాజీనామా చేస్తున్నా..త్వరలో రాజకీయ భవితవ్యంపై నిర్ణయం ఉంటుందన్నారు.