కోపం తో ఫోన్ ను మింగేసిన యువతీ

కోపం వస్తే కొంతమంది ఏంచేస్తారో వారికీ అర్ధం కాదు..చేతిలో ఏది ఉంటె అది నేలకేసి కొడతారు..మరికొంతమంది గట్టి గట్టిగా అరుస్తుంటారు. తాజాగా ఓ యువతీ మాత్రం విభిన్నంగా చేతిలోని ఫోన్ మింగేసింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని భింద్ జిల్లాలో జరిగింది. ఫోన్ విషయంలో ఆ బాలికకు..అన్నకు మధ్య గొడవ ఏర్పడింది. ఇద్దరి మధ్య మాట మాట పెరిగింది. దాంతో పట్టరాని కోపంతో ఆ బాలిక చేతిలో ఉన్న ఫోన్ ను మింగేసింది.

కొంతసేపటి తర్వాత.. వాంతులు, విపరీతమైన కడునొప్పితో ఆ అమ్మాయి బాధపడింది. బాలుడ్ని మందలించడం ద్వారా విషయం తెలసుకున్న తల్లిదండ్రులు.. గ్వాలియర్ హాస్పిటల్ కి తరలించి ఆపరేషన్ చేయించారు. తన కడుపులోనుంచి మొబైల్ ఫోన్ డాక్టర్స్ తొలగించడం తో ఆ అమ్మాయికి పెను ప్రమాదం తప్పినట్లు అయ్యింది.