నారా లోకేష్ పాదయాత్రపై ఎంపీ భరత్ కామెంట్స్

టీడీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వచ్చే ఏడాది జనవరిలో పాదయాత్ర చేయబోతున్నట్లు పార్టీ వర్గాలు చెపుతున్నాయి. దీనికి సంబదించిన రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో లోకేష్ పాదయాత్ర ఫై ఎంపీ భరత్ కామెంట్స్ చేసారు. ప్రధాని మోడీ పర్యటనకు వచ్చినప్పుడే లోకేష్‌ పాదయాత్ర గురించి పేపర్లలో రాయించారని భరత్ అన్నారు. ప్రధాని పేపర్లు చూస్తారనే ఇలా క్రియేట్‌ చేశారని ఆయన వ్యాఖ్యానించారు. ప్రధాని మోడీని కలిసిన తర్వాత పవన్‌ కళ్యాణ్ ఏం చెప్పారో.. ఆయన హావభావాలను ప్రజలు గమనించారన్నారు ఎంపీ. చిన్నబాబును, పెద్దబాబును బీజేపీలో కలపడమే పవన్ ఎజెండా అన్నారు.

అసలు మోడీని పవన్‌ కళ్యాణ్ ఏం అడిగారు.. విజభన హామీలు అడిగారా.. హోదా గురించి అడిగారా అంటూ ప్రశ్నించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌, పోలవరం ప్రాజెక్ట్ గురించి మాట్లాడారా?. రాష్ట్రానికి సంబంధించి ఏం అడిగారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు, రైల్వే జోన్ కోసం పవన్ అడిగారా అంటూ ప్రశ్నించారు. మరి భరత్ ప్రశ్నల ఫై జనసేన ఎలా స్పందిస్తుందో చూడాలి.