జైల్లో తండ్రి భాస్కర్ రెడ్డిని కలిసిన ఎంపీ అవినాశ్ రెడ్డి

ములాఖాత్ లో భాగంగా తండ్రితో మాట్లాడిన అవినాశ్ రెడ్డి

mp-avinash-reddy-met-his-father-bhaskar-reddy-in-chanchalguda-prison

హైదరాబాద్‌ః మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అరెస్టయిన వైఎస్ భాస్కర్ రెడ్డి ప్రస్తుతం చంచల్ గూడ జైల్లో రిమాండ్ లో ఉన్నారు. ఈ నేపథ్యంలో, వైఎస్‌ఆర్‌సిపి ఎంపీ అవినాశ్ రెడ్డి నేడు చంచల్ గూడ జైల్లో తండ్రి భాస్కర్ రెడ్డిని కలిశారు. ఇటీవల తండ్రి అస్వస్థతకు గురైన నేపథ్యంలో, ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ములాఖాత్ లో భాగంగా తండ్రిని కలిసేందుకు జైలు అధికారులు అవినాశ్ రెడ్డికి అనుమతి ఇచ్చారు.

వివేకా హత్య కేసులో అవినాశ్ రెడ్డి కూడా విచారణ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఆయన ఇప్పటికే పలుమార్లు సీబీఐ విచారణకు హాజరయ్యారు. ఇటీవలే న్యాయస్థానం అవినాశ్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింద.