జబర్దస్త్ టీం నుండి మరొకరు ఇండస్ట్రీ కి డైరెక్టర్ గా పరిచయం

ఈటీవీ లో జబర్దస్త్ షో ఎంత పాపులరో చెప్పాల్సిన పనిలేదు. ఈ షో ద్వారా ఎంతో మంది నటి నటులు , టెక్నీషన్లు , డైరెక్టర్స్ ఇండస్ట్రీ కి పరిచమై రాణిస్తున్నారు. సుడిగాలి సుధీర్ హీరోగా రాణిస్తుండగా.. ఆది, గెటప్‌ శ్రీను, మహేష్‌, చమ్మక్‌ చంద్ర ఇలా పలువురు నటులుగా రాణిస్తున్నారు. ఈ మధ్యనే వేణు బలగంతో దర్శకుడిగా మారి తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.

ఇక ఇప్పుడు మరో ఫేమస్ నటుడు డైరెక్టర్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. జబర్దస్త్‌ షో లో తన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను నవ్వించిన శాంతి కుమార్‌ ఇప్పుడు డైరెక్టర్ గా మారారు. సాయికుమార్‌ను ప్రధాన పాత్రలో ‘నాతో నేను’ అనే ఇంట్రెస్టింగ్‌ సినిమా చేస్తున్నాడు. ఇటీవలే రిలీజైన పోస్టర్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఎమోషనల్‌ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్‌తో పాటు పాటలకు సాహిత్యం కూడా శాంతి కుమార్‌ అందిస్తుండడం విశేషం. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే థియేటర్‌లోకి రాబోతుంది.