మహారాష్ట్ర సిఎం ఉద్ధవ్ను కలిసిన సోనూ సూద్
ఫొటోను పోస్ట్ చేసిన ఆదిత్య
ముంబయి: లాక్డౌన్ సమయంలో వలస కార్మికుల కోసం ప్రత్యేకంగా బస్సులు, రైళ్ళు, విమానాలు ఏర్పాటు చేశారు. అయితే సోనూ సూద్ చేస్తున్న సేవలపై శివసేన నేత సంజయ్ రౌత్ నిన్న విమర్శలు గుప్పించారు. సోనూ సూద్ త్వరలోనే ప్రధాని మోడిని కలిసి ముంబయికి ‘సెలబ్రిటీ మేనేజర్’ అయిపోతాడని వ్యంగ్యంగా అన్నారు. లాక్ డౌన్ అమల్లో ఉన్న సమయంలో సోనూ సూద్ అన్ని బస్సులను ఎలా తీసుకువచ్చారని ఆయన నిలదీశారు. అయితే, ఓ వైపు ఆయన విమర్శలు గుప్పించగా, మరోవైపు సోనూసూద్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేను కలవడం విశేషం. ఉద్ధవ్ థాకరేను సోనూసూద్ కలిసి మాట్లాడారని ఆదిత్య థాకరే తెలిపారు. ఎక్కువ మందికి సహాయపడటానికి అనేక మందిని కలవడం బలాన్ని ఇస్తుంది. ప్రజల కోసం కలిసి పనిచేయడానికి మంచి వ్యక్తిని కలుసుకున్నందుకు ఆనందంగా ఉంది అని ఆదిత్య తన ట్వీట్లో పేర్కొన్నారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/