నౌకలో ఘోర అగ్ని ప్రమాదం.. 36 మంది సజీవదహనం

నదిలోకి దూకి ప్రాణాలు కాపాడుకున్న పలువురు ప్రయాణికులు

ఢాకా: బాంగ్లాదేశ్ లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ మూడంతస్తుల నౌకలో మంటలు చెలరేగిన ఘటనలో 36 మంది సజీవదహనమయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ ప్రమాదం ఢాకాకు 250 కిలోమీటర్ల దూరంలోని ఝకాకఠి ప్రాంతంలోని నదిలో జరిగింది. ఈ తెల్లవారుజామున దుర్ఘటన సంభవించింది.

ఢాకా నుంచి బరుంగా వెళ్తుండగా తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో నౌకలో మంటలు చెలరేగాయి. మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో ప్రయాణికులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. ప్రమాద సమయంలో నౌకలో దాదాపు 500 మంది ఉన్నారు. ప్రాణాలు కాపాడుకోవడానికి వీరిలో చాలా మంది నదిలోకి దూకేశారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన దాదాపు 100 మందిని బారిసాల్ లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నదిలోకి దూకినవారిలో కొందరు నీటిలో మునిగిపోయారు. మునిగిపోయిన వారి కోసం గాలింపు జరుగుతోంది.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/