జులై 4న మంగళగిరి లో మోడీ చేతుల మీదుగా ఎయిమ్స్ ప్రారంభోత్సవం
ప్రధాని మోదీ జులై 4న ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రాబోతున్నారు. ఈ పర్యటనలో భాగంగా రాజధాని అమరావతి పరిధిలోని మంగళగిరిలో నూతనంగా నిర్మాణం పూర్తి చేసుకున్న ఎయిమ్స్ను ప్రారంభించనున్నారు. ఈ పర్యటనలో మోదీ వెంట కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే కూడా ఏపీకి రానున్నారు. ఈ మేరకు కేంద్రం నుంచి ప్రకటన విడుదలైంది.
ప్రధాని మోడీ ఏపీ పర్యటన నేపథ్యంలోనే ఇటీవలే రాష్ట్రంలో కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతీ ప్రవీణ్ పవార్ పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా మంగళగిరి ఎయిమ్స్ను కేంద్ర మంత్రి పరిశీలించారు. అంతేకాకుండా ఆసుపత్రి నిర్మాణం మొత్తాన్ని ఆమె నిశితంగా పరిశీలించారు. ఆమె ఇచ్చిన సమాచారంతోనే మోడీ పర్యటన ఖరారైనట్లుగా సమాచారం.
ఏపీ పర్యటన లో భారతీ ప్రవీణ్ పవార్ మాట్లాడుతూ..దేశంలో ఆరు ఎయిమ్స్లను ఏర్పాటు- చేయడం జరిగిందని, అందులో ఆంధ్ర రాష్ట్రంలోని మంగళగిరిలో ఒక ఎయిమ్స్ ఏర్పాటు- చేయడం జరిగిందన్నారు. మంగళగిరిలో ఏర్పాటు- చేసిన ఎయిమ్స్లో ఒక ఏడాది నుంచి వైద్యసేవలు అందిస్తున్నట్లు- తెలిపారు. వచ్చే నెల 4వ తేదీన భారత ప్రధాని నరేంద్ర మోడీ ఎయిమ్స్ను ప్రారంభించనున్నట్లు ఆమె తెలిపారు. ఆంధ్ర రాష్ట్రంలో తమ ప్రభుత్వం అధికారంలో లేకున్నా కూడా ఎయిమ్స్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.