రాష్ట్రాలకు 5లక్షల ర్యాపిడ్‌ టెస్టింగ్‌ కిట్ల పంపిణి

కేంద్ర ఆరోగ్య కుటుంబ సంయుక్త కార్యదర్శి వెల్లడి

love agarwal
Lav Agarwal

దిల్లీ: దేశంలో కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ నెపథ్యంలో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ సంయుక్త కార్యదర్శి లావ్ అగర్వాల్‌ పలు విషయాలను వెల్లడించారు. దేశ వ్యాప్తంగా 24 కరోనా శాంపిల్స్‌ను టెస్ట్‌ చేయగా అందులో ఒకటి పాజిటివ్‌గా తేలుతుందని అన్నారు. అలాగే రాష్ట్రాలకు 5లక్షల ర్యాపిడ్‌ టెస్టింగ్‌ కిట్లను పంపించినట్లు వెల్లడించారు. కాగా ప్రపంచదేశాలతో పోల్చుకుంటే కరోనా కట్టడిలో భారత్‌మెరుగ్గా ఉందని , ప్రజలు కూడా ఇందుకు సహకరిస్తున్నారని అన్నారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/