ఏ ఎన్నికలు వచ్చిన తెలంగాణ ప్రజలు కేసీఆర్ వెంటే – ఎమ్మెల్సీ కవిత

రాష్ట్రంలో ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చిన తెలంగాణ ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటే ఉంటారని అన్నారు ఎమ్మెల్సీ కవిత. కార్తీక పౌర్ణమి సందర్భంగా నిజామాబాద్ నగరంలోని నీలకంఠేశ్వర ఆలయంలో కుటుంబీకులతో కలిసి ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మునుగోడులో టిఆర్ఎస్‌ను గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

నల్లగొండలో హ్యాట్రిక్ సాధించామని, ఇక తెలంగాణలో ఏ ఎన్నిక జరిగిన ప్రజలంతా టీఆర్ఎస్ వైపే ఉంటారనే విశ్వాసం తనకు ఉందని చెప్పారు. ఇన్ని రోజులు అవాకులు చవాకులు చేసిన బీజేపీ నేతలకు మునుగోడు ప్రజలు సరైన సమాధానం ఇచ్చారన్నారు.

కాగా, ప్రతి ఏడు లాగానే ఈసారి కూడా కార్తీక పౌర్ణమి సందర్భంగా నీలకంటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించామని వెల్లడించారు. ఎంతో మహిమగల నీలకంటేశ్వరున్ని కార్తీక పౌర్ణమి సందర్భంగా దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు.