గాంధీనగర్ డివిజన్ లో కవిత పాదయాత్ర
బస్తీలు, కాలనీల్లో ప్రజలతో పలకరింపులు
Hyderabad: జిహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గాంధీనగర్ డివిజన్ లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాదయాత్ర చేపట్టారు.
డివిజన్లోని పలు బస్తీలు, కాలనీల్లో పాదయాత్ర చేస్తూ, ప్రజలను పలకరింస్తున్నారు. ఎమ్మెల్సీ కవిత. దాదాపు 500 మందికి పైగా కార్యకర్తలు, నాయకులతో కలిసి పాదయాత్ర చేస్తున్నారు.
గత ఆరేండ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని, టీఆర్ఎస్ మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తున్నారు.
ముషీరాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, గాంధీనగర్ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి ముఠా పద్మ నరేష్, నాయకులు జైసింహ, శ్రీధర్ రెడ్డి పాదయాత్ర లో పాల్గొన్నారు.
తాజా స్వస్థ (ఆరోగ్యం జాగ్రత్తలు) కోసం : https://www.vaartha.com/specials/health/