తనపై ఆరోపణలు చేసేవారిపై పరువు నష్టం దావా వేస్తా – ఎమ్మెల్యే రాజయ్య

గత కొద్దీ నెలలుగా స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే రాజయ్య పేరు వార్తల్లో హైలైట్ అవుతున్న సంగతి తెలిసిందే. జనగామ జిల్లా జానకిపురం సర్పంచ్ నవ్య..ఎమ్మెల్యే రాజయ్య ఫై పలు ఆరోపణలు చేయడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. ఆ తర్వాత రాజయ్య..నవ్య ఇంటికి వెళ్లడం , క్షేమపణలు కోరడం జరిగింది. కానీ ఈ వ్యవహారం సద్దుమణగలేదు. ఇప్పటికి నవ్య రాజయ్య ఫై ఆరోపణలు చేస్తూ వస్తున్నారు.

తాజాగా ఈ వ్యవహారం ఫై మరోసారి రాజయ్య స్పందించారు. గ్లోబల్స్ ప్రచారం నమ్మవద్దని, తనపై ఆరోపణలు చేసేవారిపై పరువు నష్టం దావా వేస్తామన్నారు. అలాగే ఎమ్మెల్సీ కడియం శ్రీహరి పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న కడియం శ్రీహరిని పార్టీ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ కడియం శ్రీహరి దేవాదుల సృష్టికర్త కాదు.. ఎన్ కౌంటర్ల సృష్టికర్త అని ఎమ్మెల్యే రాజయ్య ఆరోపించారు. స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గంలో కడియం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జరిగినన్ని ఎన్ కౌంటర్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడా జరగలేదన్నారు. ప్రస్తుతం రాజయ్య చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మరి ఈ వ్యాఖ్యలపై కడియ ఎలా స్పందిస్తారో చూడాలి.