మునుగోడు ప్రచారంలో వంటమనిషిగా మారిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే

మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో చిత్ర విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు నేతలు తీవ్రంగా కష్టపడుతున్నారు. ఉదయం లేచిన దగ్గరి నుండి రాత్రి వరకు ప్రతి ఇంటి గడప తొక్కుతూ తమ అభ్యర్థిని గెలిపించాలని కోరుతున్నారు. ఇదిలా ఉంటె తాజాగా మునుగోడు ప్రచారంలో టిఆర్ఎస్ ఎమ్మెల్యే వంటమనిషిగా మారి, అందర్నీ ఆశ్చర్యపరిచారు.

మల్కాజ్‌గిరి టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు..మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా చౌటుప్పల్ మండలం ఎల్లంబావిలో టీఆర్ఎస్ ఎన్నికల సభ నిర్వహించింది. ఈ సభకు హాజరయ్యే కార్యకర్తలు, అభిమానులు, ప్రజల కోసం టీఆర్ఎస్ నేతలు భోజన ఏర్పాటు కూడా చేశారు. ఈ సందర్భంగా హన్మంతరావు స్వయంగా గరిట పట్టుకుని కాసేపు వంట పనిచేయడం అక్కడ ఉన్నవారిని ఆకర్షించింది. ఆయన వంటమనిషి అవతారమెత్తడం చూసి అక్కడ ఉన్న పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. దీనికి సంబదించిన ఫొటోస్ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి.